విశాలాంధ్ర, పెద్దకడబూరు : కడప జిల్లా కంది మల్లయ్య పల్లెలో వెలసిన బ్రహ్మంగారి మఠంలో మంగళవారం గురువులను పెద్దకడబూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నరసింహాచారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వీరబ్రహ్మేంద్రస్వాముల పీఠాదిపతి, స్వాముల వారి వంశస్తుడు ఎనిమిదో మునిమనవడు శ్రీ శ్రీ వెంకటాద్రి స్వాముల వారిని, అలాగే శ్రీ శ్రీ ఈశ్వరి దేవి మఠాధిపతులు వీర శివకుమార్ స్వామిని బ్రహ్మంగారి మఠంలో నరసింహాచారి మరియు గ్రాముల వారి శిష్య బృందం శాలువతో సన్మానించి, విశ్వబ్రాహ్మణ సంఘం జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నరసింహాచారి, కడిమెట్ల నాగరాజు ఆచారి, ఎమ్మిగనూరు శ్రీనివాసాచారి, దొడ్డిమేకల శివ మరియు శిష్యులు పాల్గొన్నారు.