Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జగన్ మరోసారి సీఎం అయితే ప్రజలు పక్క రాష్ట్రానికి పారిపోవాల్సిందే

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : రాష్ట్రానికి వైయస్ జగన్ ఒక్కసారి సీఎం అయినందుకే ప్రజలు ఎప్పుడు చూడని విధంగా కష్టాలు పడుతున్నారని, మరోసారి రాష్ట్రానికి జగన్ సీఎం అయితే ప్రజలు పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సిందేనని టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసగించి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైజాగ్ వై.సి.పి. యం.పి. యం.వి.వి. సత్యనారాయణ భార్యను, కుమారున్ని, అడిటర్ ను కిడ్నాప్ చేశారంటే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అన్ని రకాల వ్యాపారస్తులపై పన్నుల రూపంలో తన ప్రతాపాన్ని చూపారనీ, అధికారులను అడ్డుపెట్టుకొని వివిధ రకాలుగా వ్యాపారస్తులపై పన్నులు విధిస్తూ, వారిని వేధింపులకు గురిచేస్తున్నారనీ విమర్శించారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో వై.సి.పి. నాయకులు చేస్తున్న దందాల కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా సర్వనాశనమైపోయిందన్నారు.
ఇప్పటికైనా జగన్ వ్యాపారస్తులపై వేధింపులు మానుకోవాలనీ, లేని పక్షంలో తెలుగుదేశంపార్టీ తరుపున వ్యాపారస్తులకు అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమౌతామని తెలిపారు.
ఒక్క చాన్సు అని జగన్ చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోయినందున, వారికి బుద్ధి చెప్పాలంటే, అను నిత్యం ప్రజలకోసం పాటుపడి యువత భవిష్యత్త్ గురించి ఆలోచించే చంద్రబాబునాయుడుని 2024లో జగరుబోయే ఎన్నికలలో గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకొని, జగన్ తగిన గుణపాఠం చెప్పాలనీ సూచించారు. కార్యక్రమంలో ఆకెపోగు ప్రభాకర్, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img