Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వాల్మీకులపై కపట ప్రేమ చూపుతున్న టిడిపి నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : బోయ వాల్మీకులపై టిడిపి నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని వైసీపీ నేత బోయ అళ్లయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే వాల్మీకులంతా ఒక్కటేనని అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కోరడం సరైంది కాదని హితవు పలికారు. రాజకీయ లబ్ధి పొందాలని బోయ వాల్మీకులందరినీ నమ్మించి గొంతు కోసే పని పెట్టుకున్నారని ఆరోపించారు. టిడిపి నాయకులు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యాలు చేసేందుకు సిద్ధమవుతారని విమర్శించారు. కొంత మంది నీచ రాజకీయ నాయకులు బోయ వాల్మీకుల పేరు చెప్పుకొని కబ్జాలు, కుళ్ళు, కుతంత్రాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బోయ వాల్మీకులు కపట ప్రేమను నమ్మవద్దని, అన్ని విధాలుగా అండగా ఉండే రాంపురం రెడ్డి సోదరులకు ఓటు వేసి బాలనాగిరెడ్డిని ఆఖండ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిన్న భీమరాయుడు, మహానంది, శేఖర్, పెద్ద భీమరాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img