Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆలూరు టిడిపి అభ్యర్థిగా వీరభద్ర గౌడ్

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : తెదేపా-జనసేన-భాజపా కూటమి ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ ను ఖరారు చేసారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆలూరు స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. తొలుత మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో తెదేపా ఇన్ఛార్జిగా ఉన్న కోట్ల సుజాతమ్మకే టికెట్ కేటాయించాలని పార్టీ అదిష్టానాన్ని ఒక వర్గం నాయకులు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఏది ఏమైనప్పటికీ ఆలూరు టికెట్ కోసం కోట్ల సుజాతమ్మ, వైకుంఠం మల్లికార్జున, వైకుంఠం జ్యోతి, వీరభద్ర గౌడ్ పోటీ పడగా చివరికి ఆ టికెట్ వీరభద్ర గౌడ్ ను వరించింది. టిడిపి శ్రేణులు, గౌడ్ వర్గీయులు నియోజకవర్గంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img