Monday, May 20, 2024
Monday, May 20, 2024

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆదోని క్రీడాకారుడు ఎంపిక

విశాలాంధ్ర – ఆదోని : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆదోని పట్టణం అరుంధతి నగర్ కు చెందిన అరుణ్ కుమార్ ఎంపికయ్యాడని కబడ్డీ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ అమర్ ప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పురుషుల కబడ్డీ ఎంపికకు 50 మంది క్రీడాకారుల హాజరయ్యారని, కర్నూలు జిల్లా టీం తరఫున 12 మంది క్రీడాకారులు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇందులో ఆదోని నుండి అరుణ్ కుమార్ హర్షించదగ్గ విషయం అన్నారు. మార్చి 8 నుండి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లా కొవ్వూరులో 70 వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఆదోని క్రీడాకారుడు అరుణ్ కుమార్ ను ఎంపిక చేసినందుకు ఆదోని ఫిలిప్స్ కమిటీ అసోసియేషన్ తరపున అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సుధాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కబడ్డీ టీం లో ఎన్నికైన క్రీడాకారుడు అరుణ్ కుమార్ తండ్రి దుబ్బ ఈరన్న మాజీ కబడ్డీ ఆటగాడు కావడంతో సహచరులు మాజీ ఆటగాళ్లు అమర్ ప్రకాష్, మారి, రామంజి జయరాం, దుబ్బ గోపి, నాగరాజు, రవి ,గోవిందు, రాజు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img