: రాకేశ్ టికాయిత్
భారత్ బంద్ నేపథ్యంలో అంబులెన్సులు, డాక్టర్లు సహా అత్యవసర సేవలకు తాము ఎలాంటి అంతరాయం కలిగించమని భారత్ కిసాన్ యూనియన్నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. కేవలం కేంద్రానికి సందేశం ఇవ్వడం కోసమే ఈ బంద్ను చేపట్టామని ఆయన వివరణ ఇచ్చారు. కేంద్రంతో ఇప్పటివరకు జరిగిన చర్చల్లో సాగు చట్టాల ప్రస్తావన తీసుకురాలేదన్నారు. అవి తప్ప ఇతర ఏ సమస్యల గురించి అయినా చర్చించాలని కేంద్రం పేర్కొందని.. అలాంటప్పుడు చర్చల వల్ల ఫలితం లేదని భావించే ఈ భారత్ బంద్ చేపట్టామని ఆయన తెలిపారు. చర్చలకు మరోసారి సిద్ధమని కేంద్రం చెప్తున్నా అది కేవలం టీవీలకే పరిమితమైందని, తమను నేరుగా ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు.దుకాణాదారులు సాయంత్రం 4 వరకు షాపులు మూసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.