వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న రైతు సంఘాలకు పలువురు మద్దతు ప్రకటించారు. సోమవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘రైతులకు బాసటగా ఉంటాను’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. రైతులు చేపట్టిన అహింసాయుత సత్యాగ్రహం నేటికీ యథాతథంగా కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం వంచనకు పాల్పడుతూనే ఉన్నందున రైతులు ఈరోజు భారత్ బంద్కు దిగారని ట్వీట్ చేశారు. భారత్ బంద్కు సీపీఐ, సీపీఎం, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాది పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), బహుజన్ సమజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, సాద్-సంయుక్త్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్, సర్వాజ్ ఇండియా తదితర పార్టీలు మద్దతు ప్రకటించారు. బంద్కు 500కు పైగా రైతు సంస్థలు, 15 ట్రేడ్ యూనియర్లు, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ బంద్ కొనసాగనుంది.