టేకాఫ్ రద్దు
రాయ్పూర్ : ఛత్తీస్గడ్ రాజధాని రాయ్పూర్లోని స్వామి వివేకానంద విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. రన్వే నుంచి పైకి ఎగురుతున్న తరుణంలో పక్షులను ఢీ కొనడంతో టేకాఫ్ను రద్దు చేశారు. ఏయిర్ ఇండియాకు చెందిన ఏ1`469లో 179 మంది ప్రయాణీకులున్నారని రాయ్పూర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాకేశ్ రంజన్ సహాయ్ చెప్పారు.ఉదయం 10.5 గంటలకు విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరుతున్న విమానం పక్షులను ఢీకొట్టిడంతో టేకాఫ్ రద్దు చేసినట్టు పేర్కొన్నారు. విమానాశ్రయ సిబ్బంది రన్వేను తనిఖీ చేస్తున్నప్పుడు పక్షి శరీర భాగాలను గుర్తించినట్టు తెలిపారు. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ విమానాన్ని తనిఖీ చేశారని పేర్కొన్నారు. ప్రయాణీకులలో కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ కూడా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడానికి ఆమె దిల్లీ వెళుతున్నట్లు మంత్రి వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.