బావిలో పడి 13 మంది మహిళల మృతి
ఓ వివాహ వేడుకలో హాజరైన వారిలో 13 మంది మహిళలు బావిలో పడి మృతి చెందారు. ఈగఘటన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో జరిగింది. పెళ్లికి హాజరైన వారిలో పలువురు మహిళలు సమీపంలోని ఓ బావి స్లాబ్పై కూర్చున్నారు. దీంతో ఉన్నట్టుండి ఆ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై కూర్చున్న వారందరూ ఒక్కసారిగా బావిలో పడిపోయారు.ఈ ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు ఆనందంగా సాగిన వివాహ వేడుక ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.