దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. కరోనా కేసులు ఒక్కసారిగా లక్ష దాటిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. వైరస్ ఉధృతిలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. మహారాష్ట్రలో గురువారం 36,265 మంది కొవిడ్ బారినపడ్డారు. ఒక్క ముంబైలోనే 20,181 కేసులు బయటపడ్డాయి. దేశరాజధాని ఢల్లీిలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఢల్లీిలో కొత్తగా 1509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. 6,900 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,498కు చేరింది. పాజిటివిటీ రేటు 15.34 శాతంగా నమోదైంది.