కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ
న్యూదిల్లీ : విద్వేషాన్ని ఓడిరచేందుకు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఒక సరైన సమయమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 10న ప్రారంభమై మార్చి 7వ తేదీ వరకు ఏడు దశల్లో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ‘విద్వేషాన్ని ఓడిరచేందుకు ఇది సరైన అవకాశం. ఎన్నికలు 2022’ అని గాంధీ హిందీలో ఒక ట్వీట్ చేశారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడిరచాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే పంజాబ్లో తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది.