ఓ రిసెప్షనిస్టు హత్యకి గురయిన ఉదతంపై రాహుల్ గాంధీ
ఓ రిసెప్షనిస్టు హత్యకి గురయిన ఉదతంపై స్పందించారు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ. అంతేకాదు యూపీలోని మొరాదాబాద్ లో అత్యాచారానికి గురైన యువతి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్, మొరదాబాద్ లో అమ్మాయిల పట్ల జరిగిన ఈ ఘటనలు ప్రతి ఒక్కరినీ నివ్వెరపరిచాయన్నారు. భారత్ జోడో యాత్రలో తాను ఎంతోమంతి ప్రతిభావంతులైన బాలికలను, యువతులను కలుస్తున్నానని, వారి ఆలోచనలను వింటున్నానని తెలిపారు. వారు భద్రంగా ఉన్నప్పుడే దేశం ముందంజ వేస్తుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.