పౌరులను రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కారణంగా భారతీయులు స్వదేశానికి రావాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడున్న కొంతమంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి 242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం మంగళవారం రాత్రి దిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఉక్రెయిన్లో సుమారు 20 వేలమంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే అక్కడ ఏర్పడిన యుద్ధ వాతావరణం కారణంగా భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అప్రమత్తమై వారిని స్వదేశానికి వచ్చేయమని సూచించింది. ఈ మేరకు వారిని ఇక్కడకు రప్పించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది. అందులో భాగంగా ఉక్రెయిన్కు వెళ్లిన ప్రత్యేక విమానంలో ఇండియాకు చెందిన 242 మంది సురక్షితంగా దిల్లీకి చేరుకున్నారు. ఇంకా అక్కడున్న వారి కోసం మూడు ప్రత్యేక విమానాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.