అఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించడం కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.అక్కడ చిక్కుకున్న భారతీయుల మన దేశంలోకి ప్రవేశించడానికి ఈ-వీసా సదుపాయాన్ని కల్పిస్తుంది. వీసా దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేసే లక్ష్యంతో ‘ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా’అనే కొత్త కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసాకు దరఖాస్తు ఫీజు లేదు. ప్రతి అప్లికేషన్ కోసం భారతదేశంలో ఉన్న రిఫరెన్స్ వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా మరియు అఫ్గనిస్తాన్లో ఉన్న ఒక రిఫరెన్స్ వ్యక్తి అవసరం అవుతుంది.