Friday, April 26, 2024
Friday, April 26, 2024

కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. సిద్దరామయ్య, డీకేలకు చోటు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంతకుముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించింది హస్తం పార్టీ. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. 124 మందితో కూడిన పేర్లను విడుదల చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకాపుర ప్రాంతం నుంచి బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు పలువురు కీలక నేతల పేర్లను సైతం పార్టీ ప్రకటించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర కొరటాగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ పడనున్నారు. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప దేవనహళ్లిలో తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రియాంక్ ఖర్గే చిటాపుర్ (ఎస్సీ) స్థానం నుంచి బరిలో దిగనున్నారు. ఇంతవరకూ ఆ రాష్ట్రంలో మరే ఇతర పార్టీ.. తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img