మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది.18 మందితో మహారాష్ట్ర కేబినెట్ కొలువుదీరింది. మంత్రి వర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది,షిండే వర్గం నుంచి 9 మందికి చోటు లభించింది. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం: చంద్రకాంత్ పాటిల్,సుధీర్ మునగంటివార్, గిరీష్ మహాజన్, సురేశ్ ఖడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సేవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం: దాదా భుసే, శంభురాజ్ దేశాయ్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్ ఉన్నారు.