Friday, April 26, 2024
Friday, April 26, 2024

కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్‌.. 18 మంది మంత్రులు వీరే

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కేబినెట్‌ విస్తరణ పూర్తయ్యింది.18 మందితో మహారాష్ట్ర కేబినెట్‌ కొలువుదీరింది. మంత్రి వర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది,షిండే వర్గం నుంచి 9 మందికి చోటు లభించింది. ఉదయం 11 గంటలకు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వర్గం: చంద్రకాంత్‌ పాటిల్‌,సుధీర్‌ మునగంటివార్‌, గిరీష్‌ మహాజన్‌, సురేశ్‌ ఖడే, రాధాకృష్ణ విఖే పాటిల్‌, రవీంద్ర చవాన్‌, మంగళ్‌ ప్రభాత్‌ లోధా, విజయ్‌ కుమార్‌ గవిత్‌, అతుల్‌ సేవ్‌ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గం: దాదా భుసే, శంభురాజ్‌ దేశాయ్‌, సందీపాన్‌ భుమరే, ఉదయ్‌ సామంత్‌, తానాజీ సావంత్‌, అబ్దుల్‌ సత్తార్‌, దీపక్‌ కేసర్కర్‌, గులాబ్‌రావ్‌ పాటిల్‌, సంజయ్‌ రాథోడ్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img