కేంద్రంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మండిపాటు
కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఎద్దేవా చేశారు. ఒకపక్క కరోనా థర్డ్వేవ్ వచ్చే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరిస్తుందని..మరో పక్క కొంత మంది యాత్రలు చేస్తుండటంపై కిమ్మకనకుండా ఉందని బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించిందని, దహీ హండి, గణేత్సవ్ లాంటి కార్యక్రమాల్లో గుంపులుగా చేరకుండా సామాజిక దూరం పాటించాలని సూచించిందని ఆయన గుర్తుచేశారు.ఇప్పుడు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టుపై గుంపులుగా చేరి నిరసన ప్రదర్శలు చేస్తున్నారని, వారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖను తప్పక చూపించాలన్నారు.