Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

త్వరలోనే పార్టీ పెడతా : అమరేందర్‌

న్యూదిల్లీ : త్వరలోనే సొంతంగా రాజకీయపార్టీని ప్రారంభిస్తానని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసన పరిష్కారమైతే 2022లో జరిగే పంజాబ్‌ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడిరచారు. ‘పంజాబ్‌ భవిష్యత్తు కోసం యుద్ధం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం త్వరలోనే పార్టీని ఆరంభిస్తాను. ప్రమాదంలో పడిన రాష్ట్ర శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం నేను నా శక్తి మేరకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నా’ అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విడిపోయిన అకాలీదళ్‌ గ్రూపులతో సహా సారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img