Friday, April 26, 2024
Friday, April 26, 2024

దళిత బాలికలు వడ్డించిన ఆహారాన్ని పడేయాలన్న వంట వ్యక్తి..అరెస్ట్‌

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మరో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బాలికల పట్ల ఓ వంట మనిషి అమానుషంగా ప్రవర్తించాడు. ప్రభుత్వ పాఠశాలలో వారి చేతులతో వడ్డించిన ఆహారాన్ని విసిరిగొట్టాడు. ఇతర విద్యార్థులు తినకుండా చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది ఉదయపూర్‌లోని గోగుండా బ్లాక్‌లోని భరోడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలికల ఫిర్యాదు మేరకు పోలీసులు వంట మనిషిని అరెస్ట్‌ చేశారు.వివరాల ప్రకారం.. శుక్రవారం బరోడి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో లాలా రామ్‌ వండిన మధ్యాహ్న భోజనాన్ని అగ్రకులాలకు చెందిన విద్యార్థులను వడ్డించమనేవాడు. అయితే వారు సరిగా వడ్డించడం లేదంటూ పలువురు విద్యార్థుల నుండి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శుక్రవారం రోజున ఉపాధ్యాయుడు దళిత బాలికలను భోజనం వడ్డించాల్సిందిగా ఆదేశించాడు. అయితే ఆ బాలికలు భోజనం పెట్టడానికి వీల్లేదంటూ లాల్‌ రామ్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఉపాధ్యాయుడు పట్టించుకోకపోవడంతో ఆ భోజనాన్ని పడేయాల్సిందిగా విద్యార్థులకు సూచించాడు. దీంతో పలువురు విద్యార్థులు ఆ భోజనాన్ని తినకుండా పారేశారు. ఆ బాలికలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో లాల్‌ రామ్‌పై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం ధృవీకరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img