దేశంలో కరోనా కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు సగం రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒకేరోజు కొత్తగా 10 మందిలో ఈ వేరియంట్ బయటపడిరది. దీంతో దిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరిందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. అయితే మొత్తం 20 కేసులలో 10 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కూడా అయ్యారని చెప్పారు.