Friday, April 26, 2024
Friday, April 26, 2024

దిల్లీలో ఒకేరోజు పది ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ వేగంగా విస్తరిస్తోంది. దాదాపు సగం రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒకేరోజు కొత్తగా 10 మందిలో ఈ వేరియంట్‌ బయటపడిరది. దీంతో దిల్లీలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 20కి చేరిందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. అయితే మొత్తం 20 కేసులలో 10 మంది వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కూడా అయ్యారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img