కరోనా సమయంలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలు చాలా మూత పడ్డాయని, వారి స్నేహితులకు లాభం చేయడానికి ప్రధాని ఇలా చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కరోనా విజృంభణ సమయంలో తొమ్మిది శాతం చిన్న తరహా, మధ్య తరగతి పరిశ్రమలు మూత పడ్డాయని అన్నారు. సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంట్లో ఒప్పుకుందని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి స్నేహితులకు లాభం చేకూర్చడానికే ఇలా చేసింది. అంటూ రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.