Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 71,365 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కి చేరింది. కరోనాతో నిన్న 1,217 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి నిన్న 1,72,211 మంది కోలుకున్నారని, ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 8,92,828 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల సంభవించిన మరణాల సంఖ్య మొత్తం 5,05,279గా ఉందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు మొత్తం 170,87,06,705 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img