Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా

గడిచిన 24 గంటల్లో 4,184 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. 104 మంది మరణించినట్లు పేర్కొంది. మొత్తంగా 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 44,488 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. బుధవారం మరో 18,23,329 డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 179 కోట్లు దాటింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img