మీరాబాయి చాను
టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో టోక్యో ఒలింపిక్స్లో విజయం సాధించిన మీరాబాయి చాను పాల్గొన్నారు. మణిపూర్లో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న మీరాబాయిని సంతోష్ కుమార్ అభినందించారు.49 కేజీల వెయిట్లిఫ్టింగ్ కేటగిరిలో సిల్వర్ మెడల్ను సాధించిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.