ఈ నెల 21వతేదీ వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురుస్తుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడిరచింది.అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఏప్రిల్ 21 వరకు బలమైన గాలులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఈ కాలంలో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.