కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు కిసాన్ సమ్మన్ నిధి కింద రెండు వేల ఇస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 9వ విడత నిధులు సుమారు రూ. 19,500 కోట్లను పీఎం నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. సుమారు 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధి వెళ్తుంది. ఆగస్టు-నవంబర్ పీరియడ్కు సంబంధించిన అమౌంట్ను రిలీజ్ చేశారు.ఈ స్కీం కింద అర్హులైన లబ్దిదారులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందుతాయి.ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో మూడుసార్లు రూ. 2 వేలు చొప్పున ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది.