కుప్పకూలిన హోటల్ బిల్డింగ్
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది.సోమవారం ఉదయం ఉత్తరాఖండ్ లోని జోషీమఠ్ సమీపంలోని ఓ హోటల్ బిల్డింగ్లో కొంత భాగం కుప్పకూలిపోయింది.ప్రమాదాన్ని ముందే గుర్తించిన అధికారులు, హోటల్ యాజమాన్యం ఇందులోని వారిని ఖాళీ చేయించారు. హోటల్ బిల్డింగ్ లోయలోకి కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంపావత్ జిల్లాలో తనక్ పూర్ ఘాట్-నేషనల్ హైవే పూర్తిగా దెబ్బతింది. రిషి గంగా, దౌలీ గంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 300 గ్రామాలకు ముప్పు తప్పకపోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. హరిద్వార్ సైతం జల విలయంలో చిక్కుకోవచ్చునని భావిస్తున్నారు.ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రానికి సుమారు 500 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని ప్రభుత్వం తెలిపింది.