కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కొత్తగా 29 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసారి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమించలేదు.