కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హత్యాచారానికి గురైన తొమ్మిదేండ్ల బాలిక తల్లితండ్రులతో తాను ఉన్న ఫోటోను షేర్ చేయడంతో రాహుల్పై న్యాయవాది వినీత్ జిందాల్ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబ సభ్యులతో తాను కలిసిఉన్న ఫోటోను షేర్ చేసిన రాహుల్ గాంధీపై చర్యలుపోక్సో చట్టం సెక్షన్ 23 కింద నేరమని, ఐపీసీ 228ఏ ఉల్లంఘన కిందకు వస్తుందని జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ చర్య జువెనిల్ జస్టిస్, పోక్సో చట్టాలకు విరుద్ధమని, ఆయనపై చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంస్థ ఎన్సీపీసీఆర్ దిల్లీ పోలీసులను కోరింది.