Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

16 నుంచి పూరీ జగన్నాథుడి దర్శనం


ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయం తెరుచుకోనుంది. ఈ నెల 16 నుంచి భక్తులకు అనుమతివ్వగా..ఈ నెల 23 నుంచి బయటి ప్రాంతాల భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 8గంటల వరకు తెరిచి ఉంచుతామని, భక్తులందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్లు, ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టులను తప్పనిసరిగా చూపించాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు 96 గంటల లోపు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టు చూపించాలి. కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఇన్నాళ్లు ఆలయాన్ని మూసివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img