Friday, April 26, 2024
Friday, April 26, 2024

బాబా రామ్‌దేవ్‌కు ఢల్లీి హైకోర్టు నోటీసు

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఢల్లీి హైకోర్టు నోటీసు ఇచ్చింది. కొవిడ్‌-19కు చికిత్సలో అల్లోపతి విధానాన్ని విమర్శించినందుకు ఆయనపై పిటిషన్‌ దాఖలవ్వగా..ఈ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం ఈ చర్య తీసుకుంది. అల్లోపతితోపాటు, అల్లోపతి వైద్యులపై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 10న జరుగుతుంది. రామ్‌దేవ్‌ బాబాపై పాట్నా, రాయ్‌పూర్‌లలో కూడా ఫిర్యాదులు దాఖలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img