ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగ పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢల్లీికి చేరుకుంది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్ ఇండియా విమానం రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దిగింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలింపునకు ‘ఆపరేషన్ గంగ’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం బుకారెస్ట్ నుంచి మొదటి విమానంలో 219 మంది ముంబై ఎయిర్పోర్టుకు, ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు 250 మందితో కూడిన రెండో విమానం ఢల్లీి విమానాశ్రయానికి చేరుకున్నది. మరో రెండు విమానాల్లో కూడా భారతీయులను తరలించారు. ఇప్పుడు ఐదో విమానం ఢల్లీికి వచ్చింది. ఉక్రెయిన్లో 13వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.