Friday, April 26, 2024
Friday, April 26, 2024

బొంగు చికెన్‌ వండి.. వడ్డించిన రాహుల్‌ గాంధీ..

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రజలతో కలిసి బొంగు చికెన్‌ని వండారు. అంతేకాకుండా తాను వండిన బొంగు చికెన్‌ను అందరికీ వడ్డించారు. పార్టీకి చెందిన తెలంగాణ నేతలు, గిరిజనులతో కలిసి ఆయన బొంగు చికెన్‌ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) శనివారం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఇటీవలే తెలంగాణను దాటుకుని మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో యాత్ర సాగుతున్న సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు రాహుల్‌గాంధీ ఆసక్తి చూపారు. ఈ క్రమంలో యాత్ర ముగుస్తున్న సమయంలో టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్‌ గాంధీ పొలాల మధ్యన భేటీ అయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img