ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్సింగ్ ఆరోగ్యం మరింత విషమించింది. ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని లక్నోలోని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘‘కళ్యాణ్సింగ్ జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. మంగళవారం సాయంత్రం నుంచి ఆయనను లైఫ్ సేవింగ్ సపోర్ట్పై ఉంచాం.. సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య స్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తోంది’’ అని లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడిరచాయి.ఇంతకు ముందు ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర పార్టీ నేతలు పరామర్శించారు.మంగళవారం యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కళ్యాణ్సింగ్ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ నెల 4 నుంచి ఆయన రాంమనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ మెరుగైన ట్రీట్ మెంట్ కోసం లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ ఆసుపత్రిలో చేర్చారు.