26 మంది విద్యార్థులకు పాజిటివ్
ముంబైలోని అగ్రిపదలోని సెయిట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది.పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా..అందులో 26 మందికి పాజిటివ్గా నిర్థారణయ్యిందని అధికారులు వెల్లడిరచారు.వారిలో 12 ఏండ్లలోపు వయస్సున్నవారు నలుగురు ఉన్నారని, వారిని నాయర్ దవాఖానకు తరలించామని చెప్పారు. మిగిలిన 22 మందిని రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించినట్లు తెలిపారు.