మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో కాంగ్రెస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.శుక్రవారంనాడు ఆయన మీడియా ముందు మాట్లాడుతూ, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పార్టీ అధికారిక ట్విట్టర్లో కాంగ్రెస్ మండిపడిరది. మంత్రి పదవి కోసం లాబీలు చేయడం కాదు, ఇచ్చిన శాఖకు న్యాయం చేయాలే కానీ, అసమర్థుడిగా మాట్లాడటం మీ సంస్కారానికి నిదర్శనమంటూ విరుచుకుపడిరది. దీనిపై జ్ఞానేంద్ర స్పందిస్తూ, ఎవరి మనోభావాలను గాయపరచడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు.