Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ పాలన ఓ కేస్‌ స్టడీగా ఉపయోగపడుతుంది : రాహుల్‌గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ట్విటర్‌లో మోదీ పాలనపై విరుచుకుపడ్డారు. .ఎనిమిదేళ్ల పాటు మోడీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని మండిపడ్డారు. మోదీ పాలన సక్రమంగా లేని కారణంగా కరెంట్‌ సంక్షోభాన్ని, ఉద్యోగాల సంక్షోభాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని రాహుల్‌ ఆరోపించారు. మోదీ పాలన ఓ కేస్‌ స్టడీగా ఉపయోగపడుతుందని దెప్పి పొడిచారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలన్న దానిపై మోదీ అసమర్థ పాలన ఓ కేస్‌ స్టడీలా వుందంటూ రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img