11 మంది మృతి
ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి
రాజస్తాన్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగౌర్ జిల్లాలో బికనీర్-జోధ్పూర్ రహదారిలోని శ్రీ బాలాజీ టెంపుల్ సమీపంలో ఈ ప్రమదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ఓ కారు, టక్కు పరస్పరం ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులంగా మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.రాజస్తాన్లోని రామ్దేవరా కర్నీ మాత దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఇంటికి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.్డ ఈ ప్రమాద ఘటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్పందించారు.ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడిరచారు. అలాగే ప్రమాదంలో మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్గ్రేషియా సహాయాన్ని ప్రకటించారు.