Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రపతి, ప్రధాని హోలీ శుభాకాంక్షలు

న్యూదిల్లీ: హోలీ సందర్భంగా సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చే స్నేహ బంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం హోలీ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా సంప్రదాయబద్ధంగా ఈ హోలీ ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ కుటుంబ సభ్యులు, స్నేహితులను ఒకచోట చేర్చి ఆనందంగా చేసుకోవాల్సిన సమయమని వారు తమ సందేశాల్లో పేర్కొన్నారు. ఇంకా హోంమంత్రి అమిత్‌షా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన, కాంగ్రెస్‌ తదితర పార్టీల నాయకులు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img