లఖింపూర్ ఖేరి : లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండ కేసులో రిమాండ్లో ఉన్న కేంద్రమంత్రి అజయ్మిశ్రా తనయుడు ఆశిష్మిశ్రా, మరో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని టికోనియా గ్రామంలో ఆ రోజు జరిగిన పరిణామాలను సిట్ అధికారులు వరుసగా పరిశీలించారు. గురువారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. భారీ భద్రత మధ్య నిందితులను టికోనియా`బంబీర్పూర్ రోడ్డుపై జరిగిన ఘటనాస్థలికి తీసుకెళ్లారు. దర్యాప్తు అధికారులు ఉదయమే జిల్లా జైలుకు వెళ్లి నిందితులు దాస్, లతీఫ్, భారతీలను పోలీసు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను ముందుగా క్రైమ్బ్రాంచ్ ఆఫీసుకు…అక్కడి నుంచి ఘటనాస్థలానికి తరలించారు.