Friday, April 26, 2024
Friday, April 26, 2024

వినాయక మండపానికే రూ.316 కోట్ల ఇన్సూరెన్స్‌..!

గణపతి నవరాత్రి ఉత్సవాలకు యావత్‌ దేశం సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు కూడా సిద్ధమవుతున్నాయి. కొన్ని చోట్ల ఖరీదైన గణేశ్‌ మూర్తులను ఏర్పాటు చేస్తుండగా మరి కొన్ని చోట్ల భారీ సెట్టింగ్‌లతో తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఓ గణేశ్‌ మండపానికి ఏకంగా రూ.316కోట్లతో ఇన్సూరెన్స్‌ చేయించారు.ముంబాయిలోని కింగ్స్‌ సర్కిల్‌లో జీఎస్‌బీ సేవా మండల్‌ నగరంలోనే అత్యంత ఖరీదైన మండపంగా నిలిచింది. ఆ మండపం బాధ్యతలు చూసేవారితో పాటు అక్కడకు వచ్చే భక్తులకు అక్కడి నిర్వాహకులు భారీ బీమా చేయించారు. ఇందుకోసం రూ.316కోట్లు మొత్తానికి ఇన్సూరెన్స్‌ చేయించగా అందులో రూ.31.97కోట్లు మండపంలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు ఈ పరిధిలోకి వస్తాయి. మరో రూ.263కోట్లు మాత్రం మండపానికేనని నిర్వాహకులు వెల్లడిరచారు. వీరిలో వాలంటీర్లు పూజారులు, వంటవాళ్లు, చెప్పులు భద్రపరిచేవారు, పార్కింగ్‌, సెక్యూరిటీ సిబ్బంది ఈ బీమా కిందకు వస్తారు. అగ్నిప్రమాదం భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో కోటి రూపాయల బీమా తీసుకున్నారు. వీటిలోకి అక్కడి ఫర్నీచర్‌ కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు వంటివి వస్తాయి. గత 68ఏళ్లుగా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించడం మా బాధ్యత అని జీఎస్‌బీ సేవా మండల్‌ ఛైర్మన్‌ విజయ్‌ కామత్‌ పేర్కొన్నారు. వినాయక చవితి మొదలు 10రోజుల పాటు ఇక్కడి నిర్వహకులు భక్తులకు ఈ బీమా వర్తిస్తుందన్నారు. ఏటా ఇటువంటి ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నప్పటికీ ఈ సారి రికార్డు స్థాయిలో గరిష్ఠ మొత్తానికి బీమా చేయించినట్లు మండపం నిర్వహకులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img