Friday, April 26, 2024
Friday, April 26, 2024

శ్రీశైలం చేరుకున్న కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై శ్రీశైల మహాక్షేత్రానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. ఈ మధ్యాహ్నం 12.45 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెంట మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, క్యాబినెట్‌ మంత్రులు గోవింద్‌ కర్జోల్‌, మురుగేష్‌ నిర్ణాని ఉన్నారు. ఈసందర్భంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లకు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, జిల్లా కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌, జిల్లా ఎస్పీ కె. రఘువీర్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, బాగల్‌కోట్‌ ఎమ్మెల్యే వీరన్నచారంతిమత్‌, రాయచూర్‌ ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌, కర్ణాటక ఎమ్మెల్యే లు సిద్ధు శివాది, ఎ.ఎస్‌.పాటిల్‌, రాష్ట్రీయ ధర్మ జాగృతి మహాసమ్మేళన ప్రతినిధులు జగదీష్‌, గురురాజ్‌ చారంతిమట్‌, హర్షగుట్టేదార్‌, కౌశిక్‌, బసయ్య మహాలింగపురమత్‌, ప్రశాంతి దుగ్గతిమత్‌, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img