న్యూదిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావ్పూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆయనకు నివాళి అర్పించారు. సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్యను పెంపొందించడంకోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బహుముఖ వ్యక్తిత్వం ఆయనదని మోదీ పేర్కొన్నారు. అలాగే మరో రెండు రోజుల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి కూడా రానున్న సందర్భంగా ప్రధాని ‘మన్కీ బాత్’లో ప్రత్యేక కార్యక్రమం రాగా, ఈ కార్యక్రమంలో ఆయన ఇద్దరికీ నివాళి అర్పించారు. తమ విలువైన కాలాన్ని భారత దేశ ప్రజలకు వెచ్చించిన మహనీయులు అంబేద్కర్, జ్యోతిరావు పూలే అని మోదీ తెలిపారు. పూలే జయంతిని బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహించింది. అలాగే మంగళవారం అంబేద్కర్ జయంతిని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధచేస్తోంది.