Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల విడుదల..

సత్తా చాటిన అమ్మాయిలు !
12వ తరగతిలో 92.71 శాతం ఉత్తీర్ణత

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 12వ తరగతిలో 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 94.54 శాతం మంది అమ్మాయిలు పాస్‌ కాగా… 91.25 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. టర్మ్‌ 1, టర్మ్‌ 2 వెయిటేజ్‌ మార్కుల ఆధారంగా ఫైనల్‌ మార్క్‌ షీట్లను సీబీఎస్‌ఈ తయారుచేసింది. విద్యా సంవత్సరంలో సాధించిన ఇంటర్నల్‌ అసెస్‌ మెంట్‌ మార్కులు, ప్రాజెక్ట్‌ వర్క్‌, ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌, ప్రీబోర్డ్‌ ఎగ్జామ్స్‌ మార్కులు స్కోర్‌ కార్డులో ఉంటాయి. ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 4 వరకు టర్మ్‌ 2 పరీక్షలు జరిగాయి. టర్మ్‌ 1 పరీక్షలను గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img