Friday, April 26, 2024
Friday, April 26, 2024

సైబర్‌ దాడులకి గురైన దేశాల్లో.. రెండోస్థానంలో భారత్‌

ఈ మధ్యకాలంలో ఆన్‌ లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక సైబర్‌ దాడులగురించి వేరే చెప్పనవసరం లేదు.ఈ దాడులకి సెలబ్రిటీలు కూడా బలి అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాగా ఐటీ, టెక్నాలజీ, ఈ-కామర్స్‌, మీడియా అండ్‌ ఎంటర్టైన్మెంట్‌, మార్కెటింగ్‌ రంగాల్లో సైబర్‌ దాడులు తగ్గుముఖం పట్టాయి. అయి ఈ పరిశ్రమలన్నీ టార్గెట్‌ దాడులతో టాప్‌ 10 పరిశ్రమల జాబితాలో నిలిచాయి.కాగా ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. 2022 ఏడాదిలో ఆసియాలోనే అత్యధిక సైబర్‌ దాడులు భారత్‌ పైనే చోటుచేసుకున్నాయని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. 2021, 2022 సంవత్సరాల్లో సైబర్‌ దాడుల పరంగా ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్‌, ఐరోపా అత్యంత లక్ష్యంగా-బలహీనమైన ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. 2022లో ఆసియాలోనే అత్యధిక సైబర్‌ దాడులు భారత్‌ లో జరిగాయని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌ఎస్‌ఈకే తాజా నివేదిక వెల్లడిరచింది.
ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది అమెరికా తర్వాత సైబర్‌ దాడులకు గురైన దేశంగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. 2022లో భారత్‌ లో సైబర్‌ దాడులు, హ్యాకింగ్‌ కేసులు 24.3 శాతం పెరిగాయని గ్లోబల్‌ థ్రెట్‌ ల్యాండ్స్కేప్‌ రిపోర్ట్‌ 2021-2022 తెలిపింది. గత రెండేళ్లలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక సైబర్‌ దాడులు జరిగాయని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2021లో జరిగిన సైబర్‌ దాడుల్లో 20.4 శాతం, 2022లో జరిగిన సైబర్‌ దాడుల్లో 24.1 శాతం ఈ ప్రాంతంలోనే జరిగాయి. క్లౌడ్సెక్‌ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్ల ప్రధాన లక్ష్యం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం ఉంది. సైబర్‌ దాడి కేసులలో 26.43 శాతం పెరుగుదలను ఈ ప్రాంతం చూసింది. 2021, 2022 సంవత్సరాల్లో సైబర్‌ దాడుల పరంగా ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్‌, ఐరోపా అత్యంత లక్ష్యంగా- బలహీనమైన ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి.
2022లో సైబర్‌ దాడుల సంఖ్య 8.28 శాతం పెరగడంతో యూరప్‌ రెండో స్థానంలో నిలిచింది. 2021లో ఇది మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగానే ఈ దాడులు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఉత్తర అమెరికాలో హ్యాకింగ్స్‌ తగ్గుముఖం పట్టినప్పటికీ, 2022లో అత్యధికంగా టార్గెట్‌ అయిన ప్రాంతాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఉత్తర అమెరికాలో ఆన్లైన్‌ దాడుల కేసులు 2021లో 18.9 శాతం నుంచి 2022 నాటికి 16 శాతానికి తగ్గాయని నివేదిక పేర్కొంది. క్లౌడ్సెక్‌ ట్రయాడ్‌ కు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్‌ మాట్లాడుతూ 2022 లో టెక్నాలజీ లక్ష్యంగా సైబర్‌ దాడులు పెరగడంతో సైబర్‌ నేరాలు పెరిగాయి. భూగర్భ కార్యకలాపాలు పెరగడం వల్ల హానికరమైన టూల్స్‌, మాల్వేర్ల వినియోగం పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. అనేక కొత్త రాన్సమ్‌ వేర్‌ గ్రూపుల ఆవిర్భావం, పాతవాటి పట్టుదల ఫలితంగా సైబర్‌ దాడులు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు వంటి రంగాలు ముప్పు శక్తుల దృష్టిని ఆకర్షించాయని ఐఏఎన్‌ఎస్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img