న్యూదిల్లీ: పరిశుభ్రత విషయంలో దేశం కొత్త కథలు రాస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కొత్త శక్తిని ఎలా నింపుతుందో స్వచ్ఛ భారత్ అభియాన్ కళ్లకు కడుతుందని ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ… 11.5 కోట్లకు పైగా గృహాలు, 58 వేల కంటే ఎక్కువ గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం, అలాగే 3,300 నగరాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారడాన్ని వివరించే గ్రాఫిక్ను ప్రధాని ట్విట్టర్లో పంచుకున్నారు. ప్రజల భాగస్వామ్యం దేశాభివృద్ధిలో కొత్త శక్తిని ఎలా నింపుతుందో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రత్యక్షంగా చూపుతుందని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.