థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కార్యకర్తల నిరసన
థానే: సఫాయీ కార్మిక వ్యవస్థకు చరమగీతం పాడాలని, కాలువలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం అనేకమంది కార్యకర్తలు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పాలక వర్గ సభ్యులకు వినతిపత్రాన్ని సమర్పిస్తూ రానున్న రెండు నెలల్లో సఫాయీ కార్మిక వ్యవస్థపై సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. మ్యూస్ ఫౌండేషన్, శ్రామిక్ జనతా సంఫ్ు నుంచి వచ్చిన పలువురు ఆందోళనకారులు థానే మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్తో మాట్లాడుతూ జెట్ పంపుల్లాంటి ఇతర యంత్రాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.