Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

102 కిలోల నల్లమందు స్వాధీనం

ఈశాన్య రాష్ట్రం నుంచి రాజస్థాన్‌కు కంటైనర్‌ లారీలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నల్లమందు పెద్దమొత్తంలో సప్లయ్‌ అవుతుందన్న సమాచారం మేరకు పోలీసులు, సెంట్రల్‌బ్యూరో ఆఫ్‌ నార్కోట్రిక్స్‌ బృందం నిఘాపెట్టింది. ఓ కంటైనర్‌ లారీలో డ్రగ్స్‌ సప్లయ్‌ చేస్తుండగా రాజస్థాన్‌లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ టీమ్‌ చాకచక్యంగా పట్టుకుంది. జైపూర్‌-ఆగ్రా హైవేపై రాజధోక్‌ టోల్‌ ప్లాజా వద్ద లారీని ఛేజ్‌ చేసి మరీ 102.910 కిలోల బరువున్న 95 నల్లమందు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రక్కును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ , నీముచ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు అశోక్‌ లేలాండ్‌ ట్రక్‌లో పెద్ద మొత్తంలో నల్లమందు తరలిస్తున్నట్టు ముందస్తుగా అధికారులకు సమాచారం అందింది. ఈ పక్కా సమాచారం మేరకు వాహనం వస్తున్న దారిలో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. అయితే.. పోలీసులు, నార్కోటిక్స్‌ బృందం ట్రక్కును చూసి పక్కకు ఆపాలని కోరారు. పోలీసులను చూసిన లారీ డ్రైవర్‌ వారి వాహనంపైనుంచి లారీని ఎక్కించేందుకు డ్రైవర్‌ యత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ట్రాలర్‌ లోపల ప్రత్యేకంగా నిర్మించిన కేబిన్‌?లో నల్లమందు దాచినట్లు గుర్తించారు.సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ట్రాలర్‌ను క్షుణ్ణంగా శోధించారు. ట్రాలర్‌ లోపల ప్రత్యేకంగా నిర్మించిన ఓ కేబినెట్‌?లో 102.910 కిలోల బరువున్న 95 నల్లమందు ప్యాకెట్లును పోలీసులు గుర్తించారు. ఎన్‌డిపిఎస్‌ చట్టం, 1985 నిబంధనల ప్రకారం డ్రగ్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img