26/11 అటాక్స్ లేదా ఉదయ్పూర్లో టైలర్ హత్య..సిద్దూ మూసేవాలాలాంటి దాడులు జరుగుతాయని ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్కు వచ్చిన మెసేజ్ కాల్ తీవ్ర కలకలం రేపింది. కంట్రోల్ సెల్కు గుర్తుతెలియని వ్యక్తి ఈ మెసేజ్ ని పంపాడు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. ట్రాఫిక్ కంట్రోల్ సెల్ వాట్సాప్ నెంబర్కు వచ్చిన బెదిరింపు సందేశం పాకిస్తాన్ నెంబర్ నుంచి వచ్చినట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాల తెలిపింది. తనని..తను ఉన్న స్థానాన్ని గుర్తించినట్లయితే’ అది బయట ఉన్నట్టుగా తేలుతుందని మెసేజ్ పంపిన వ్యక్తి చెప్పాడు. ముంబైలో దాడి జరుగుతుందని మెసేంజర్ బెదిరించాడు. భారత్లోని ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడతారన్నాడు..