దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు 10 వేల దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా జూన్ నెల నాటి రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో 22,031 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉందని పేర్కొంది. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 88.55 కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా 212.17కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.